Your Ad Here

Thursday, December 29, 2011

Andhra Pradesh Public Service Commision Group 2 Notification

హైదరాబాద్: ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం మధ్నాహ్నం గ్రూప్-2తోపాటు వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2739 పోస్టులకు 10 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఏపీపీఎస్‌స్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌లో డిగ్రి కళాశాల లెక్చరర్లు 656, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 319, ఎగ్జిక్యూటివ్ 119, నాన్ ఎగ్జిక్యూటివ్ 404 పోస్టులు ఉన్నాయి.

డిగ్రీ కళాశాల లెక్చరర్ల ఉద్యోగాల భర్తీకి మే 6 వ తేదిన, ఆర్‌డబ్ల్యూఎస్‌ఏఈఈ పోస్టుల కోసం జూలై 1 తేదిన, గ్రూప్-2 పరీక్షను జూలై 15 తేదిన నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టులకు 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. వీఆర్‌ఓ 9 లక్షలుకు పైగా, వీఆర్‌ఏ 1 పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు.

0 comments:

Post a Comment

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | SharePoint Demo